ఢిల్లీ ఉచకోత.. ముంబాయి టార్గెట్ ఎంతటే?

నవతెలంగాణ – ఢిల్లీ: ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫ్రేజర్‌ (84; 27 బంతుల్లో 11×4, 6×6) ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. పోరెల్‌ (36), హోప్‌ (41), రిషబ్‌ (29), స్టబ్స్‌ (48*), అక్షర్‌ (11*) మెరుపులు మెరిపించారు. బౌలర్లలో వుడ్‌, బుమ్రా, పియూష్‌, నబీ తలో వికెట్‌ తీశారు. తాజా ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటి వరకు 200+ స్కోర్లు 25 సార్లు నమోదయ్యాయి.

Spread the love