గెలుపు కోసం పాస్టర్ రాజ్ తో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్న కడియం కావ్య, శ్రీహరి

నవతెలంగాణ – ధర్మసాగర్
 గెలుపు కోసం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజ్ తో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. శనివారం మండలంలోని కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్ధన మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గొప్ప విజయం సాధించాలని రెవరెండ్ డాక్టర్ సంఘాల పాల్సన్ రాజ్, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాశ్ రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love