పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణానికి రావాలని కాంగ్రెస్ నాయకులకు ఆహ్వాన పత్రిక

నవతెలంగాణ – తొగుట
పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణానికి రావాలని కాంగ్రెస్ నాయకులకు ముదిరాజ్ కుల సభ్యులు ఆహ్వాన పత్రిక అందించారు. శనివారం మండల కేంద్రమైన తొగుట గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో వచ్చే నెల 6 తేదీన జరిగే పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహో త్సవానికి హాజరు కావాలని మెదక్ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి లకు ముదిరాజ్ సంఘం నాయకులు దుబ్బక కాంగ్రెస్ పార్టీ కార్యాలయoలో ఆహ్వాన పత్రిక అందజే శారు. అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహో త్సవం కార్యక్రమానికి హాజరవుతామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్య క్రమంలో టిఫిసిసి కార్యదర్శి రేపాక తిరుపతి, చిక్కుడు భాలమల్లు, వెంకటేష్, అంనదం, విష్ణు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love