పారిశుద్ద్య కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలి

– ధర్మ సమాజ్ పార్టీీ డిమాండ్.
నవతెలంగాణ – తొగుట

గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కాసర్ల యాదగిరి అన్నారు. శనివారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న గ్రామపంచాయతీ, పారిశుద్ధ్య కార్మికు లకు గత 3 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నా పారిశుధ్య కార్మికుల వేతనాలు వస్తే కానీ వారి ఇల్లు గడవనీ పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మి కులకు ఎంతో కష్టంగా మారిందనీ కావున రాష్ట్ర ప్రభుత్వం వేంటనే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించా లని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుం దని అన్నారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందో ళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో  మండల నాయకులు లింగం, ప్రశాంత్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love