కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రంజాన్

– ఎంపీటీసీ వేల్పులస్వామి ముదిరాజ్
నవతెలంగాణ – తొగుట
కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రంజాన్ అని ఎల్లారెడ్డి పేట ఎంపీటీసీ వేల్పుల స్వామి ముదిరాజ్ అన్నారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డి పేట గ్రామంలో ముస్లిం సోదరులకు ఇప్తర్ విందును ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష ను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాలతో కఠోర దీక్ష చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ ముస్లిం కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ రంజాన్ అని  అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టి కమిటీ సంఘం అధ్యక్షుడు సైపొద్దిన్, ఇస్మాయిల్, యాకు బ్, అరిప్ గౌసు, అక్బర్, బీఆర్యస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు భాస్కర్, ఏల్లగౌడ్, ప్రవీణ్, బాల్ రాజు తదితరుల పాల్గొన్నారు.
Spread the love