భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోసమే కృషి చేస్తా

– కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం.
నవతెలంగాణ – తొగుట 
భవన నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోస మే కృషి చేస్తా నని కార్మిక సంఘం జిల్లా అధ్యక్షు డు శ్రీశైలం అన్నారు. సోమవారం విలేకరులతో  మాట్లాడుతూ 14 రంగాల కార్మికులంతా ఏకమై తనను రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నా రు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో కార్మికుల జీవితాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఏవి కార్మికులను పట్టించుకోలే దని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సమ స్యలు గుర్తించకపోవడం వల్లే సంఘం తనను పార్ల మెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసేందు కు 14 సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికు లందరూ తనకు మద్దతుగా నిలబడి తనను గెలి పించాలని కోరారు. గెలుపుతో సంబంధం లేకుండా భవన నిర్మాణ రంగ కార్మికుల ఓటు శాతాన్ని పరి గణలోకి తీసుకోవాలని సూచించారు. మండల లోని భావన నిర్మాణ కార్మికులందరూ ఎంపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న జిల్లా అధ్యక్షుడు శ్రీశైలంకు తమ మద్దతు ఉంటుందని మండలంలోని భావన నిర్మాణ కార్మికులందరు హామీ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో జిల్లా కోశాధికారి అనిమెల్ల బుచ్చిరాజు, మండల అధ్యక్షుడు స్వామి, మండల కోశాధికారి కాసర్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి చందు, మస్తాన్, కృష్ణ లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love