మాజీ సీఎం కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు

నవతెలంగాణ – తొగుట

మాజీ సీఎం కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపామని మాజీ సర్పంచ్ బిక్కనూరి రజిత శ్రీశైలం యాదవ్ తెలిపారు. మంగళవారం ఆమె నవతెలంగాణతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజల పండుగ ఉగాది సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన ఫామ్ హౌస్ లో కలిసామని అన్నారు. ఈ  సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పాలకరించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love