కడియం కావ్యను కలిసిన ఎన్నారై రామ్ రెడ్డి

నవతెలంగాణ – ధర్మసాగర్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్  పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యని ఎన్ఆర్ఐ వల్లపురెడ్డి రాం రెడ్డి సోమవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి
పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో వారిని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ రావడంతో హర్షం వ్యక్తం చేశారు. కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి కాసిం, పింగిలి బాపురెడ్డి, అప్పని రమేష్,  అప్పని శమునయ్య , భాష బోయిన రాజు ,వక్కల వెంకటనారాయణ, కేశిరెడ్డి రంజిత్ రెడ్డి, ఎండి అంకుస్, మాచర్ల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love