ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి 

నవతెలంగాణ – జూలపల్లి 
మండలంలోని కాచాపూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై ఎన్. శ్రీధర్ కథనం ప్రకారం కాచాపూర్ గ్రామానికి చెందిన పుట్ట ప్రశాంత్ (32) రోజు లాగానే ట్రాక్టర్ పనిలో భాగంగా  వరి కోత మిషన్ హార్వెస్టర్ నుండి వడ్లను చేరవేసే క్రమంలో ఉర చెరువు శివారు ప్రాంతంలో అదుపుతప్పి చిన్న కల్వర్టుపై ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  ఎస్ ఐ తెలిపారు .మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం ఈ సంఘటనతో కాచాపూర్ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Spread the love