నీతి నిజాయితీ అనీ ప్రజలను మోసం చేస్తున్న కడియం

నవతెలంగాణ – ధర్మసాగర్

నీతి నిజాయితీఅనీ ప్రజలను మోసం చేస్తున్నారని కడియం శ్రీహరి తన స్వార్ధ రాజకీయాలకోసం కూతురు కడియం కావ్యను రాజకీయ భవష్యత్తుపై కోసం అనేక మందిని బలి తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్లమెంటు సభ్యులు  ఆరురి రమేష్ మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్ లో బీజేపీ మండల పార్టీ విస్తుత స్థాయి సమావేశం ధర్మసాగర్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, వెలేర్ మండల పార్టీ అధ్యక్షులు రాజు యాదవ్ ఆధ్యర్యంలో జరిగింది. కార్యక్రమానికి ఆయన మఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితులను పెద్దగనీయకుండా గెలిస్తే మంత్రి అవుతాడనో భయంతో కావాల్సి, ప్రక్కనే ఉండీ వెన్నుపోటు పొడిచిన కడియం శ్రీహరి గారికి జిల్లా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆరోపించారు.యువత చేతిలోనే దేశ భవష్యత్తు ఉందని,రాన్నున పార్లమెంట్ ఎన్నికలో తమ పాత్ర  ఎంతో ముఖ్యమని అన్నారు. ఈనెల 12న జరిగే నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని బూతు లెవెల్ నాయకులనుండి ముఖ్య నాయకులు వరకు ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఐనావోలు అంజిరెడ్డి,జాతీయ కార్యవర్గ సభ్యులు,పార్లమెంటు కన్వీనర్ తక్కలపెల్లి కుమారస్వామి గౌడ్,రాష్ట్ర నాయకులు బొజ్జపెల్లి సుభాష్,మాజీ ఎమ్మెల్యే,క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ధర్మారావు, గుండె విజయరామారావు,చిలుక విజయ రావు,తకలపెల్లి రాజేశ్వరరావు, గంకిడి శ్రీనివాస్ రెడ్డి,రజచెంద్రయ్య,భాగ్యలక్ష్మి,విజయ్ శ్రీరాముల,నగవెల్లి యుగెందేర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love