బాధిత కుటుంబానికి పరామర్శ 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలంలోని  పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన అంకన్నగారి  నడిపి సాయిలు కుటుంబ సభ్యులను శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో అంకన్నగారి సాయిలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మల్లికార్జున్ రెడ్డి మృతుని  కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అంకన్నగారి సాయిలు మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి వెంట బిజెపి రాష్ట్ర నాయకులు రేంజర్ల గంగారం, బిజెపి మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
Spread the love