కలిసి కట్టుగా బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీగా గెలిపిద్దాం..

– మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
బీఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, నిజామాబాద్ ఎంపీ గా బాజిరెడ్డి గోవర్ధన్ విజయానికి కృషి చేయాలని ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగదాస్ అన్నారు. శనివారం  ఇందల్ వాయి మండలంలోని  డోంకల్, గౌరరం, గుట్ట కింది తండా,లింగపుర్ గ్రామాలలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ శాసన సభా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మరోసారి ప్రజలకు మోసగించడానికి అమలు కాని హామీ లను ఇస్తుందన్నారు.బిజెపి పార్టీ అబివృద్ధి చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చుస్తుందని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్తలు బుత్ ల వారిగా అదిక మెజార్టీ వచ్చే విధంగా చూడాలని సూచించారు.ఈ సమావేశానికి వైస్ ఎంపీపీ  బుసని అంజయ్య,గడ్కోల్ శ్రీనివాస్, తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్,కుంట నర్సారెడ్డి,మోహన్ నాయక్, భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love