నటరాజ నృత్యానికేతన్ విద్యార్థినుల ప్రదర్శన

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణానికి చెందిన నటరాజ నృత్యనికేతన్ నాట్య గురువు బాశెట్టి మృణాళిని శిష్య బృందం శనివారం జరిగిన కార్యక్రమంలో అద్భుత ప్రదర్శన చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హరిదా రచయితల సంఘం ఇందూర్ యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మద్దుగురి సాయి బాబాకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా, అద్భుతమైన నాట్యంతో అలరించారు. ఈ సందర్భంలో చిన్నారులకు జ్ఞాపికలతో శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. సమాజ సేవలో యువత ముందుండాలని గురువు భాశెట్టి మృణాళిని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Spread the love