కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

– యాదగిరిగుట్ట మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ఎండి యాకూబ్ అలీ
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు.  గంధమల్లలో శుక్రవారం, బీర్ల ఐలయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎండి యాకూబ్ అలీ ని యాదగిరిగుట్ట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకొని ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేరిన వారు బిఆర్ఎస్ మాజీ వార్డ్ మెంబర్ వాకిటి లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ గ్రామ శాఖ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కబీర్, బిఆర్ఎస్ మండల నాయకులు సుంచు యాదగిరి, ఎండి మదర్ షా, ఎమ్మ రమేష్, ఎండి హుస్సేన్, ఎండి నజీర్, ఎస్.కె గుంశల్, వాకిటి పెద్ద మైసయ్య, వాకిటి మహేష్, వాకిటి చిన్న మైసయ్య, ఎండి షాదుల్లా, ఎండి బాబు షరీఫ్, ఎస్కే శాదుల్ల, ఎస్.కె పాషా, ఎస్కే మౌలానా, ఎండి గోరుమియా, ఎండి బాబు, ఎండి హైదర్, ఎండి జమీర్, ఎండి చాన్ పాషా, ఎండి కరీం, ఎస్.కె చోటేమియా, ఎండి గౌస్ అలీ, ఎండి బాల కరీం, ఎస్ కే సైదులు, ఎస్ కే సాజిద్, ఎస్కే షరీఫ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్, పిఎసిఎస్ డైరెక్టర్లు కోల లింగం, ఎముల ఏలేందర్ రెడ్డి, వార్డు మెంబర్లు కళ్లెం విజయ జాంగిర్, ఎండి ఉస్మాన్, సుంచు వినోద్, యూత్ అధ్యక్షులు హరిబాబు, జిల్లా నాయకులు దర్గా జాంగిర్, కాంగ్రెస్ నాయకులు సగ్గ కిష్టయ్య, గ్రామ శాఖ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి బురాన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love