ఏపీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ సుమారు వెయ్యి ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ప్రతి రోజూ హైదరాబాద్‌‌లో పలు ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ పట్టణాలకు అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నెల 18-23 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. వీటికి సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని వెల్లడించారు.
Spread the love