Tuesday, June 17, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రైతులకు గుడ్ న్యూస్...

రైతులకు గుడ్ న్యూస్…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైతులకు శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతు భరోసాకు సంబంధించిన పైసలు.. రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. జూన్ 17వ తేదీ.. మంగళవారం నుంచి రైతు బ్యాంక్ ఖాతాల్లో.. రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు. ఎకరాలతో సంబంధం లేకుండా.. అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేశారు. ఎకరాలకు సీలింగ్ అంటూ ఏమీ లేదని.. రైతులందరికీ ఒకే విడుతలో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పారు. మంత్రులంతా గ్రామాల బాట పట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లో స్థానిక మంత్రులు, ఇన్ చార్జి మంత్రులు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు  సాగాలని అన్నారు. ఈ నెల  చివరి వరకు ప్రభుత్వ పథకాల పై విసృత ప్రచారం కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -