నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శనివారం డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభం అవుతుందని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా.. అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కవగా లాభం పొందారు.