ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 2023-2024 అడ్మిషన్ల

నవతెలంగాణ -నిజాంసాగర్
మండలంలోని నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 2023-2024  అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం కోరారు. నిజం సాగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులూ mpc bipc cec hec కోర్సులలో ఖాళీలు ఉన్నాయని పదవ తరగతి పూర్తయిన విద్యార్థులు ఆ కాలేజీలో చేరాలని ఆయన కోరారు అడ్మిషన్ ఫీజు మరియు టెక్స్ట్ బుక్స్ ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పాడు. వేరే గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కూడా ఉంటుందని అలాగే స్కాలర్షిప్ సౌకర్యం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.
Spread the love