రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా కోఆర్డినేటర్ గా గంగాధర్ గౌడ్

నవతెలంగాణ- కంటేశ్వర్
రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గా మాక్లుర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఏ.గంగాధర్ గౌడ్ ని నియమిస్తూ జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జాతీయ ఆర్ జి పి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి కిరణ్ మూగబసవ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్  అందజేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుంది.
Spread the love