- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయం ప్రక్కన నూతనంగా శ్రీఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం కోసం మంగళవారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజం, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు మంగళవారం భూమిపూజ నిర్వహించి హనుమాన్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు.
- Advertisement -



