గురుకుల ప్రతిభ కళాశాల-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 4 న నిర్వహణ

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాలల్లో 2024 -25 సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియెట్ ప్రవేశానికి సంబందించిన ప్రవేశ పరీక్ష COE CET -2024 ఈ నెల 04 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని ఎంపిక చేసిన పరీక్షాకేంద్రాల్లో నిజామాబాద్ జిల్లాలో డిచ్ పల్లి మండలం లోని ధర్మారం-బి, కంజర, ఆర్మూర్ ,  డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి, పోచంపాడ్, నవీపేట్, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, భిక్నూర్, దోమకొండ, తాడ్వాయి, తడ్కోల్/కొయ్యగుట్ట, తక్కడపల్లి/పెద్దకొడబ్ గల్, కామారెడ్డి డిగ్రీ కళాశాల, పెద్ద ఎక్లార & బాన్సువాడ/బొర్లాం, నిర్మల్ జిల్లాలోని ముధోల్, లెప్ట్ పోచంపాడ్, జామ్, కడెం, భైంసా లో నిర్వహించబడుతుందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయాధికారిణి కె. అలివేలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్ లు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్ధులు www.tswreis.ac.in వెబ్ సైట్ ల ద్వారా అంతర్జాలం నుండి హాల్ టికెట్ లు ముందుగానే డౌన్ లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు సకాలంలో హాజరుకావలని సూచించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా పరీక్షాకేంద్రానికి అభ్యర్ధులు చేరుకోవాలని పేర్కొన్నారు. తమ వెంట పరీక్ష ప్యాడ్, రెండు బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ పరీక్షా కేంద్రానికి తీసుకవెళ్లాలని ఆలస్యం అయినచో అనుమతించ బడదని సూచించారు. తప్పనిసరిగా పరీక్షాకేంద్రాన్ని ఒకరోజు ముందుగానే సందర్శించి నిర్ధారించుకోవాలని సూచించారు. పరీక్షాకేంద్రాలను గుర్తిచడంలో ఏవైనా ఇబ్బందులుంటే, హాల్ టికెట్ లో ముద్రించిన ముఖ్య పర్యవేక్షకుని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని వివరించారు.
Spread the love