పసికందు మృతదేహం..సగం వరకు శరీరాన్ని పీక్కుతున్న

నవతెలంగాణ వేములవాడ : వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఉన్న చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందును.. పందులు కుక్కలు సగం వరకు శరీరాన్ని పీక్కుతున్న అమానవీయ ఘటన సోమవారం పట్టణంలో కలకలం చోటు చేసుకుంది. అయితే చెట్ల పొదల నుంచి దుర్గంధం వెదజల్లడంతో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు మృతదేహాన్ని గమనించి స్థానిక ప్రజలకు తెలియజేయడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పుడే పుట్టిన నవజాతి పసికందును సగం శరీరం వరకు పందులు, కుక్కలు పీక్కు తినడంతో స్థానిక వార్డు ప్రజలు తీవ్రంగా చలించిపోయారు.విషయం తెలుసుకున్న పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాల తెలియాల్సి ఉంది, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు చేశారు. అమృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ఇలాంటి సంఘటన జరగడం చాలా కలిసి వేస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Spread the love