తాడ్వాయి నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

– జ్యోతక్క రాకతో ఉర్రూతలు ఊగిన తాడ్వాయి..
– జన బలమే తన బలంగా ముందుకు సాగుతున్న మన జ్యోతక్క
నవతెలంగాణ -తాడ్వాయి

సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలు, అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అందులో భాగంగా బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో జడ్పీ చైర్మన్, ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి బడే నాగజ్యోతి  సమక్షంలో మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు దాదాపు 70 కుటుంబాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి సాదరంగా ఆహ్వానించి శాలువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని, మన కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రమణయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు బంగారు సాంబయ్య, నాయకులు పిన్నింటి యాదిరెడ్డి, బంగారు శ్రీరాములు, బీఆర్ఎస్ శ్రేణులు మంతెన శీను, నాగరాజు, నరేష్, ప్రవళిక, స్వరూప, లక్ష్మి, ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి గంటా మనోజ్ రెడ్డి, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love