- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మసక వెలుతురు కారణంగా టెస్ట్ మ్యాచ్లు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ‘పింక్ బాల్’ ఉపయోగించేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిబంధన ప్రకారం మ్యాచ్ ఎరుపు బంతితో ప్రారంభమై, వెలుతురు తగ్గినప్పుడు, ఇరు జట్ల అంగీకారంతో ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్తో మిగిలిన ఓవర్లు ఆడతారు. టీ20 తరహాలోనే టెస్టుల్లోనూ డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో వ్యూహాలు చర్చించవచ్చు. ఇక మహిళల చాంపియన్స్ ట్రోఫీ 2027 షెడ్యూల్ను ఫిబ్రవరికి మార్చారు.
- Advertisement -



