పివి ఆర్ట్స్ పతాకంపై తల్లాడ సాయికష్ణ, స్వప్న చౌదరి హీరో, హీరోయిన్గా అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ముఖ్య తారాగణంతో తల్లాడ సాయికష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్టరీ’. వెంకట్ పులగం నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను పాత్రికేయుల సమక్షంలో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ, ‘దర్శకుడు సాయికష్ణ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘ఈనెల 21తో షూటింగ్ పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తాం. మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ చిత్రమిది’ అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికష్ణ చెప్పారు. సుమన్ మాట్లాడుతూ, ‘నేటి కాలం పిల్లలు తప్పుడు దారిలో నడుస్తున్నారు. ఎవరిని లెక్కచేయడం లేదు. కొందరు పిల్లలు తల్లిదండ్రులనే కొడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లలు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఈ అంశాలతో ఉన్న ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాను’ అని తెలిపారు.