- Advertisement -
– పెన్షన్ పెంపు హామీ విస్మరణపై బీఆర్ఎస్ నిరసన
– వెంటనే అమలు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించడమే.. ప్రజాపాలనాంటూ మండల బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. పెన్షన్ పెంపు హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించడంపై మండల బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
- Advertisement -



