IND vs SA: టీమిండియా ఘన విజయం..

నవతెలంగాణ-హైదరాబాద్ :  వన్డే వరల్డ్‌ కప్‌లో భారత జైత్రయాత్ర అప్రతీహాతంగా సాగుతోంది.   వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదుచేస్తూ  టీమిండియా  రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల  వరద పారిస్తున్న  సఫారీల ఆటలు భారత్‌ ముందు   సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న   సౌతాఫ్రికా..   327  పరుగుల ఛేదనలో ముక్కీమూలుగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా  చేయకుండా  83 పరుగులకే చేతులెత్తేసింది.  ఫలితంగా భారత్‌.. 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.  టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌  రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో  సఫారీల   పతనాన్ని శాసించగా షమీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.  ఆ జట్టులో  మార్కో జాన్సెన్‌ 14 పరుగులతో టాప్ స్కోరర్‌.

Spread the love