నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్రనేతలు జూన్ 1న ఢిల్లీలో సమావేశమవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం. పార్టీ నివేదికల ప్రకారం ఈ చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేతలు, కూటమి నేతలు, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గోనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆప్ ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాల్లో కాంగ్రెస్తో సీట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకుంది.