పోలియో కేంద్రాల తనిఖీ: డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీత ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పోలియో నమోదు శాతం రికార్డులను పరిశీలించిన అనంతరం మండల పరిధిలోని వెల్టూర్, ఈరట్వానిపల్లి గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 2942 ఉండగా మొదటి రోజు 2883 మందికి విజయవంతంగా వేశామని మొదటి రోజే పోలింగ్ 98 శాతం పూర్తయిందని జోన్స్ ఫార్మసిస్ట్ శ్రీనివాసులు తెలిపారు. మిగిలిన వారికి సోమవారం, మంగళవారం ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల సిబ్బంది, సిహెచ్ఓ, అంగన్వాడి, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love