శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్టాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం..

నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఆలయ నిర్మాణ కమిటీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఆహ్వానం పత్రికను అందించారు. ఈనెల 11వ తేదీ గురువారం నుండి 13వ తేదీ శనివారం వరకు నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహ, యంత్ర, ధ్వజ, శిఖర ప్రతిష్టా మహోత్సవములకు భక్తులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరిపే మల్లేష్, గంగోని రాము, ఎన్ ఎన్ రెడ్డి, మోస్రా సాయి రెడ్డి, గోపాల్ తదితరులు ఉన్నారు.
Spread the love