మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ – నవీపేట్
మార్చి 3వ తేదీ ఖమ్మంలో జరిగే విప్లవ పార్టీల ఐక్యత మహాసభల పోస్టర్లను సీపీఐఎంఎల్  ప్రజాపంతా ఆధ్వర్యంలో మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ ప్రజా పంత డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా, సీపీఐఎంఎల్ ఆర్ఐ పీసీసీ, సీపీఐఎంఎల్ మూడు విప్లవ ఐక్యత జాతీయ మహాసభలను మార్చి 3, 4 ,5 తేదీలలో ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు, ఈ మహాసభలకు రైతులు, కార్మికులు, ఉద్యోగులు,  రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సూచించారు. ప్రజల హక్కుల కోసం, శ్రామిక వర్గాల రాజ్యం కోసం ప్రజా పంథా పార్టీ లు మాత్రమే కృషి చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగన్న, రాజేశ్వర్, నసీర్, ఒడ్డెన్న, గోపాల్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love