ఇంత అద్వానమా…?

– మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పై సీపీఐ అసహనం
– సంబంధిత గుత్తేదారుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ 
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ నిర్వహణ లోపాలపై మండల సీపీఐ నాయకులు ఇంత అద్వానమంటూ అసహనం వ్యక్తం చేశారు.సోమవారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ నిర్వహణలో లోపాలను మండల సీపీఐ నాయకులు సందర్శించి పరిశీలించారు.సెంట్రల్ లైటింగ్ నిర్వహణలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయని..అలసత్వం వహిస్తున్న గుత్తేదారుపై సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను త్వరితగతిన సవరించాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులు గుత్తేదారుకు వత్తాసు పలికేల విధులు నిర్వర్తిస్తున్నారని భావిస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.నాయకులు రూపేశ్,మధు,మహేందర్, మహేశ్,రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love