నవతెలంగాణ -ఆత్మకూరు
ఆత్మకూరు మండలం జయశంకర్ గ్రామం అక్కంపేటలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సమాజ మద్దతు పెంపొందించడం, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు సిద్ధం కావడం, పిల్లల విద్య, వైద్యం, పోషణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కె. నరసింగరావు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ హైమావతి, ఏఎన్ఎం సరిత, ఆశలు, వసంత, మాధవి, పిల్లలు పాల్గొన్నారు. మండల పెద్దాపూర్ లోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్లో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అంగీకారంతో వాక్సినేషన్ వేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో వాడాదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రతలు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, సిహెచ్ఓ ఖలీం జునేది, రాజ్యలక్ష్మి, అనిల్, సంభాయ్య, అశ్విని, కృష్ణవేణి, ఎల్లమ్మ, ఆశలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
అక్కంపేటలో పోషన్ పక్వాడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



