నవతెలంగాణ – హైదరాబాద్: ఐటీ విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. 84 గంటల పాటు పైళ్ల శేఖర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ ముమ్మర తనిఖీలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా పైళ్ల శేఖర్రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. నేడు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్లోని ఐటీ ఆఫీస్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు పేర్కొన్నారు. శేఖర్రెడ్డితోపాటు జనార్దన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయితే నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరు కానున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిని గురువారం హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.