హర్రర్‌ థ్రిల్లర్స్‌లో స్పెషల్‌ సిరీస్‌ అవుతుంది

It will be a special series in horror thrillersనవీన్‌ చంద్ర లీడ్‌ రోల్‌లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘ఇన్స్‌పెక్టర్‌ రిషి’. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్‌, మాలినీ జీవరత్నం, కుమార్‌ వేల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్రర్‌ క్రైమ్‌ కథతో ఈ వెబ్‌ సిరీస్‌ను నందిని జె.ఎస్‌. దర్శకత్వంలో మేక్‌ బిలీవ్‌ ప్రొడక్షన్స్‌ పై సుఖ్‌ దేవ్‌ లాహిరి నిర్మించారు. అమోజాన్‌ ఒరిజినల్‌గా ఈ సిరీస్‌ ఈ నెల 29వ తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్‌ నందిని జేఎస్‌ మాట్లాడుతూ, ‘ఈ వెబ్‌ సిరీస్‌ను మొదట మేం తమిళం వరకే చేద్దామని అనుకున్నాం. కానీ మేకింగ్‌ అయ్యాక మొత్తం ఐదు భాషల్లో రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సిరీస్‌లో ఏ కులాన్నీ, మతాన్నీ, ఎవరి విశ్వాసాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండవు. ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది’ అని తెలిపారు. ‘నేను హర్రర్‌ కంటెంట్‌ చేసి చాలా రోజులవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ కథ విన్నప్పుడు ఇందులో హర్రర్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌, యాక్షన్‌ …లాంటి అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయనిపించింది. ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్‌లోనూ అనేక లేయర్స్‌ ఉంటాయి. హర్రర్‌ థ్రిల్లర్స్‌లో ఇదొక స్పెషల్‌ సిరీస్‌ అవుతుంది. 10 ఎపిసోడ్స్‌ సిరీస్‌ ఇది. ప్రతి ఎపిసోడ్‌ ముగిశాక నెక్ట్స్‌ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది’ అని హీరో నవీన్‌ చంద్ర చెప్పారు.

Spread the love