ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన

నవతెలంగాణ- ఢిల్లీ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. మూడు రోజుల పర్యటనలో నీతి అయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు.  హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో జగన్ కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు అమిత్ షా నివాసంలో  భేటీ జరిగింది.

Spread the love