నవతెలంగాణ – రాజ్ కోట్: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్లో బాగంగా మూటో టెస్టు రాజ్ కోట్ లో జరుగుతుంది. ఈ టెస్టులో మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 319 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులకే అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన గిల్(45) తో జైశ్వాల్ నిలకడగా రాణిస్తూ.. అందొచ్చిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో 122 బంతులు ఆడిన అతను.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేశాడు. కాగా ఈ యువ బ్యాటర్కి ఇది ఈ సిరీస్లోనే రెండో సెంచరీ కావడం విషేశం.