నవతెలంగాణ – హైదరాబాద్: భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ గురువారం ఉదయం నుంచి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని, అందులో నిజం లేదని ఆమె వివరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.