నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో శనివారం నుంచి జూనియర్ కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. అదేరోజు నుంచి జూనియర్ కాలేజీలకు కొత్త విద్యాసంవత్సరం (2024-25) ప్రారంభమవుతుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు శుక్రవారంతో వేసవి సెలవులు ముగిసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది.