కలంచర్ల లింగయ్య మృతి.. సీపీఐ(ఎం)కు తీరని లోటు

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
 నవతెలంగాణ ఆత్మకూర్ ఎస్ 
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కలంచర్ల లింగయ్య (85)అనారోగ్యంతో బాధపడుతూ మండల పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో గురువారం ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సందర్శించిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కలంచర్ల లింగయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు. కామ్రేడ్ లింగయ్యకు చదువు లేనప్పటికీ పార్టీ పట్ల ఆచంచలమైన విశ్వాసం, విధేయత కలిగి ఉన్నారని  గుర్తు చేశారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేశారని అన్నారు. చనిపోయేంతవరకు నీతిగా, నిజాయితీగా అంకిత భావంతో జీవించారని కామ్రేడ్ కలంచర్ల లింగయ్య బాటలో యువత ప్రయాణించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, మండల కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు ఎండి జహీరుద్దీన్, బెల్లంకొండ మాణిక్యం, మోరపాక సైదులు, ఎరగాని అంజయ్య, మామిడి లింగయ్య, ఎరగాని సైదులు, పిడమర్తి నరసయ్య, గ్రామ ఎంపీటీసీ ఉప్పుల మల్లయ్య, గ్రామ ఉపసర్పంచ్ కలం చర్ల చంద్రయ్య, పూలే అధ్యయన వేదిక  జిల్లా నాయకులు జటంగి సమనయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love