నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటాగా వస్తున్నాయి. కేరళలో మాజీ ఆరోగ్య మంత్రి కే.కే.శైలజా టీచర్ ఆధిక్యంలో ఉన్నారు.