జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేసీఆర్‌ సమావేశం

నవతెలంగాణ-హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పోడు పట్టాల పంపిణీ, హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా విషయాల్లో ప్రభుత్వం తరఫున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేసీఆర్‌ పలు సూచనలు చేయనున్నారు.

Spread the love