ఎన్టీపీసీలో 300 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఎలక్ట్రికల్‌, మెకానిక్‌ విభాగంలో ఆపరేషన్స్‌ లేదా మెయింటేనెన్స్‌ పోస్టులు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం పోస్టులు: 300 ఇందులో ఎలక్ట్రికల్ 120, మెకానికల్ 120, ఎలక్ట్రానిక్స్/ఇన్‍స్ట్రుమెంటేషన్ విభాగంలో 60 చొప్పున పోస్టులు ఉన్నాయి. అర్హతలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‍స్ట్రుమెంటేషన్, పవర్ ఎలక్ట్రిక్‌ కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులతో బీ.టెక్ ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు 35 ఏండ్ల లోపువైరై ఉండాలి. ఎస్‍సీ, ఎస్‍టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, మెడికల్‌ టెస్టు
దరఖాస్తు విధానం: ఆన్‍లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 2
వెబ్‍సైట్‍: www.careers.ntpc.co.in

Spread the love