ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం : కేవిపిఎస్

నవతెలంగాణ-హైదరాబాద్ : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ దళితబంధు ఎంఆర్ పిఎస్ కొడుకులకు కూడా ఇచ్చాం అంటూ వ్యాఖ్యానించడం, దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం కేవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు జాన్ వెస్లీ టి స్కైలాబ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు వారు మాట్లాడుతూ దళిత బందులో అవినీతి జరిగిన దానిని స్వయాన ముఖ్యమంత్రి గారి అంగీకరించారని అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన చేతిలో ఉందని ప్రకటించారని అదే విషయాన్ని ప్రస్తావించిన దళిత న్యాయవాధీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం శోచనీయం అన్నారు దళితబంధు రాజకీయలకతీతంగా అర్హులైన దళితులందరికి ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్ ప్రకారం అందరికి ఇవ్వాలన్నారు ఎం ఆర్ పి ఎస్ కొడుకులకు కూడా ఇచ్చామని ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి దళితులపై పరుష పదజాలం వాడడం సమర్థనీయం కాదన్నారు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాధీకి మెరుగైన వైద్యం అందించాలని దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కేవిపిఎస్ నేతలు డిమాండ్ చేశారు తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తుంగతుర్తి నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడం సరికాదన్నారు ప్రశ్నిస్తున్న నాయకుల మీద, జర్నలిస్టుల మీద, మేధావుల మీద దాడులు శోచనీయమని చెప్పారు. ఇలాంటి ఘటనలు వ్యాఖ్యలు పునరావృతం కాకుడదని కేవిపిఎస్ తెలిపింది

Spread the love