పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్‌లు విడుదల.. సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షలు

నవతెలంగాణ – శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో భారత వైమానిక (ఐఏఎఫ్‌) దళం వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్కెచ్‌లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్‌ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి. శనివారం సాయంత్రం పూంచ్‌లోని షాసితార్ సమీపంలో ఐఏఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆకస్మిక దాడిలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

Spread the love