తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిసెంబరు 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love