Tuesday, September 15, 2026
E-PAPER
Homeక్రైమ్కోదాడ రోడ్డు ప్రమాదం..మృతుల వివరాలు

కోదాడ రోడ్డు ప్రమాదం..మృతుల వివరాలు

- Advertisement -

నవతెలంగాణ-కోదాడ :సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు ఎన్టీఆర్‌ జిల్లా తేలప్రోలుకు చెందిన యాసారపు చిన్ని (32), విజయవాడకు చెందిన మేరీ జ్యోత్స్న (29), నాగేంద్రబాబు (21), సురవరపు షకీనా, భావన, లక్ష్మిగా గుర్తించారు.

ఐరన్‌ సామగ్రితో రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో.. ఐరన్‌ షీట్స్‌ బస్సులోకి చొచ్చుకెళ్లాయి. దీంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికుల తలలో గుచ్చుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటన తర్వాత బస్సు డ్రైవర్‌ మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం 9గంటలకు ఏలూరు చేరుకోవాల్సిన బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఆరుగురి మృతదేహాలు ప్రస్తుతం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట కలెక్టర్‌, జిల్లా ఎస్పీ కోదాడ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -