-హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండా ఎల్లయ్య మృతి బాధాకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.హైదరాబాదులో ఎల్లయ్య గుండెపోటుతో మృతిచెందగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ సోమవారం ఎల్లయ్య నివాసంలో మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.