నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్ణారెడ్డి

నవతెలంగాణ – బెజ్జంకి

బెజ్జంకి మండల నూతన ఎస్ఐగా జే.క్రిష్ణారెడ్డి బుధవారం పోలీస్ స్టేషన్ యందు బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించి, బదిలీపై వచ్చి మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్ఐ క్రిష్ణారెడ్డికి ఏఎస్ఐ శంకర్ రావు,పోలీస్ స్టేషన్ సిబ్బంది గౌరవంగా ఘన స్వాగత పలికారు.
Spread the love