తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో కష్ణవేణి ఒకరు. 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడి గ్రామంలో కష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి కష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారితో తాను సాగిపోయారు.
ఎన్.టీఆర్, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి లీలా వంటి ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తెలుగు సినిమా తొలి తరం నటి, గాయనీ, స్డూడియో అధినేత్రి కష్ణవేణి (101) అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 16 వ తేది ఆదివారం ఉదయం ఫిల్మ్నగర్లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో కష్ణవేణి ఒకరు. 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడి గ్రామంలో కష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి కష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారిలో తాను సాగిపోయారు.
1936లో దిగ్గజ దర్శకుడు సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘సతీ అనసూయ’తో బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి’ చిత్రాలు కష్ణవేణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1939లో నూజివీడు సంస్థానాధిపతి మీర్జాపురం జమీందార్ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. 1941లో తన భర్తతో కలిసి ‘శోభానాచల పిక్చర్స్’ అనే చిత్రరంగ సంస్థని స్థాపించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా అవతరించారు కష్ణవేణి. ఆ సంస్థలో ఆమె నిర్మించిన తొలి సినిమా ‘ధక్షయజ్ఞం’ (1941). తన సొంత బ్యానర్లో ఆమె నటించిన ‘గొల్లభామ’ (1947) కష్ణవేణిని స్టార్ హీరోయిన్ని చేసింది. ఈలపాట రఘరామయ్య కథానాయకుడిగా వచ్చిన ఆ సినిమా ద్వారానే మహానటి అంజలీదేవి చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇక శోభనాచల స్టూడియోస్ నిర్మించిన మరో క్లాసిక్ ‘కీలుగుర్రం’ (1949). ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, అక్కినేనిని మాస్ హీరోగా నిలబెట్టింది. ఇక కష్ణవేణి జీవితంలో మరపురాని చిత్రం ‘మనదేశం’ (1949). ఆ సినిమా ద్వారానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారకరామారావు వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన పోలీసాఫీసర్గా చిన్న పాత్ర చేశారు. దేశం గర్వించదగ్గ ఆ మహానటుడ్ని వెండితెరకు పరిచయం చేసి, చరిత్రలో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు కష్ణవేణి. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకునిగా పరిచయమైంది కూడా ‘మనదేశం’ సినిమాతోనే కావడం మరో విశేషం. ఈ సినిమా ద్వారానే పి.లీల గాయనిగా పరిచయమయ్యారు. ఆ విధంగా తెలుగు సినిమా లెజెండ్స్ ఎన్టీఆర్, ఘంటసాల, అంజలీదేవి, గాయని పి.లీల.. వీరందరికీ తొలి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు కష్ణవేణి. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మకథ’, కష్ణవేణి టైటిల్ పాత్రతో వచ్చిన ‘లక్ష్మమ్మ’ ఈ రెండు సినిమాలు.. 1950లో ఒకేసారి విడుదలయ్యాయి. వీటి కథ కూడా ఒకటే. అయితే.. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పరాజయం చవిచూడగా, కష్ణవేణి ‘లక్ష్మమ్మ’ విజయాన్ని సాధించింది. అలాగే భీష్మ (1944), మదాలస (1948), పేరంటాళ్లు (1951) తదితర చిత్రాల్లో కూడా కష్ణవేణి నటించారు.
హీరోయిన్ గా తొలి చిత్రం ‘కచదేవయాని’
కష్ణవేణి హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ 1938లో వచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాలలో నటించారు. 1939లో ‘మహానంద’ చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్థ దర్శకనిర్మాత మీర్జాపురం రాజా ను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం కష్ణవేణి భర్త కోరిక మేరకు బయటి చిత్రాలలో నటించలేదు. సొంత చిత్రాలలో నటించారు. అలానే తమ శోభనాచల స్టూడియోస్ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదే బ్యానర్లో పలు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సాంఘీక చిత్రం ‘జీవనజ్యోతి’ ద్వారానే చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు. ‘మనదేశం’తో నిర్మాతగా మారిన కష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కుపైగా చిత్రాల్లో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది. ‘కీలుగుర్రం’, ‘బాలమిత్రుల కథ’ చిత్రాలకు గాయనిగా పనిచేశారు.
ఎన్టీఆర్ను పరిచయం చేసిన కష్ణవేణి
నందమూరి తారక రామారావు.. తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు విగ్రహంలా కనిపిస్తారు. సినీ రాజకీయరంగంలో తనదైన ముద్రవేసిన నటసౌర్వభౌముడు ‘మనదేశం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి.. తారక రాముడిని మనకు పరిచయం చేశారు కష్ణవేణి.
తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. బాలనటిగా అడుగుపెట్టిన ఆమె… ఓ గొప్ప నటుడ్ని తెరకు పరిచయం చేసే అదష్టాన్ని పొందింది. పారితోషికంగా రూ.250 చెక్కును ఆమె చేతుల మీదుగానే రామారావు తీసుకున్నారు.
కష్ణవేణిది లక్కీ హ్యాండ్
నాడు నటీనటులకు జీతం రూపంలో డబ్బులిచ్చేవారు కష్ణవేణి. మనదేశం చిత్రానికి ఎల్వీ ప్రసాద్కు 15 వేల రూపాయలిచ్చిన ఆమె ‘చక్రధారి’ చిత్రానికి నాగయ్యకు అత్యధికంగా 90 వేల రూపాయలు జీతంగా ఇచ్చారు. అలాగే ‘కీలుగుర్రం’ సినిమాకు అక్కినేనికి 10 వేలు ఇచ్చారు. ఆ డబ్బుతో నాగేశ్వర్రావు తొలిసారిగా కారు కొనుక్కోవడం విశేషం.
గాయనిగా
కష్ణవేణికి గుర్తింపు తెచ్చిన చిత్రాలు ‘లక్ష్మమ్మ, గొల్లభామ’. నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడే కష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు. విశేషం ఏమంటే ఆమె ‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్ పాడారు. కష్ణవేణి పలు చిత్రాలలో నటించినా… ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు ‘లక్ష్మమ్మ, ‘గొల్లభామ’. త్రిపురనేని గోపీచంద్ ‘లక్ష్మమ్మ’ సినిమాని మొదట మాలతీతో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్ టేకోవర్ చేసింది. దాంతో అందులో కష్ణవేణి నాయికగా నటించింది. ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయికగా ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ మొదలైంది. రెండూ పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి. అయితే కష్ణవేణి నటించిన ‘లక్ష్మమ్మ’కే జనం ఓటు వేశారు. ఇక 1947లో వచ్చిన ‘గొల్లభామ’ నటిగా కష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే… కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని కష్ణవేణికి ఉండేది. ఆమె ‘తిరుగుబాటు’ అనే సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు.
నిర్మాణ సంస్థలు
భర్త స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు. సొంత సంస్థ – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ సంస్థను ఏర్పాటు చేసి చిత్రాలను నిర్మించారు.
పురస్కారాలు
తెలుగు సినిమా పరిశ్రమకు కష్ణవేణి చేసిన జీవితకాలపు సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. 2021 లో సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్ టైమ్ ఎఛివ్మెంట్ అవార్డును ఆమె అందుకున్నారు. 2022లో ఆకతి సంస్థ ఆధ్వర్యంలో ఆకతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని సి. కష్ణవేణికి అందచేశారు.
ఇటీవల విజయవాడలో జరిగిన ‘మనదేశం’ వజ్రోత్సవ వేడుకల్లోనూ కష్ణవేణి పాల్గొన్నారు. చక్రాల కుర్చీలోనే విజయవాడకు వెళ్ళిన ఆమెను ఆ వేదికపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. కష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధవతార రాలిపోయినట్టయ్యింది.
– డా. పొన్నం రవిచంద్ర,
9440077499